భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం-అడ్డూరి శ్రీరామ్

భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం-అడ్డూరి శ్రీరామ్

భారతీయ జనతా పార్టీ విజయవాడ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. 

 జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్   అధ్యక్షతన 

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

విధ్యాధరపురం,ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో   ఎస్ కన్వెన్షన్ దగ్గర లో గల అగర్వాల్ కళ్యాణ మండపం నందు జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయజనతాపార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్ బాజి మాట్లాడుతూ దేశం మొత్తంలో జరుగుతున్న అభివృధ్దిలో భాగంగా ఆంద్ర ప్రదేశ్ లో కూడా అభివృధ్ది చెయ్యాలనే తపనతో ప్రధాన మిత్రపక్షాలతో  పొత్తు పెట్టుకొని వెలుతున్న సందర్బంలో ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రజలందరిని మేము అడగ గలిగే అంశం ఎమిటంటే ఎవరైతే కరొనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారో,ఎవరైతే గత 7 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నారో,ఎవరైతే లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇస్తున్నారో,ఎవరైతే జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కొలాయిలు ఇస్తున్నారో ,ఉజ్వల యోజన పథకం క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారో,ఎవరైతే స్వచ్చభారత్ క్రింద ఉచిత మరుగుదొడ్లు ఇస్తున్నారో,ఎవరైతే సాగర మాల ,భారత్ మాలలో దేశం మొత్తం నేషనల్ హై వేలు నిర్మిస్తున్న సందర్బంలో విజయవాడలోని బెంజి సర్కిల్ ఫ్లైఓవర్,కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ లు నిర్మించారో వారికే ఓట్లు వెయ్యాలని,అలాగే కులం,మతం,వర్గం వర్ణం చూడకుండా నరేంద్ర మోదిగారు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ పేరుతో ముందుకు వెళుతున్నారో అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నాయకుల కూటమితో ముందుకు వెళతామని, ఈ సారి విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బిజెపి  అభ్యర్దిని గెలిపించాలని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయజనతాపార్టీ ,తెలుగుదేశం,జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఆంద్ర ప్రదేశ్ లో 6 పార్లమొంటు 10 అసెంబ్లీ నియోజక వర్గాలు బిజెపి కి కేటాయించిన నేపధ్యంలో తెలగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడుగారికి,జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్  కృతజ్ఢతలు  తెలియజేస్తూ,పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ సీటును బిజెపికి కేటాయించినందుకు కూటమి సభ్యులకు ధన్యవాధములు తెలియజేస్తూ,రాష్ట్రంలో అవినీతి అరాచకంతో పాలన కొనొసాగిస్తున్న వైసిపి పాలన అంతమే లక్ష్యంగా బిజెపి,తెలుగుదేశం,జనసేన కూటమి పనిచేస్తందని,అలాగే కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్,సబ్ విశ్వాస్ అనే నినాధంతో ఆంద్ర ప్రదేశ్ ప్రజల అభివృధ్ది సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతామని,అలాగే 500 సంవత్సరాల రామమందిర నిర్మాణ కలను నెరవేర్చిన నరేంద్ర మోదిగారి వెంట ప్రజలందరు ఉన్నారని,గతంలో 2014 పొత్తులో  భాగంగా బిజెపి అభ్యర్ది 3 వేల ఓట్లతో ఓడిపోయారని, ఈ సారి 30 వేల మెజారిటితో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామని,ఆయన ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బొడ్డు నాగలక్ష్మి,ఉప్పలపాటి శ్రీనినాసరాజు,మువ్వల సుబ్బయ్య,ఆర్ముగం,బబ్బూరి శ్రీరామ్,బిజెపి నియోజకవర్గ కన్వినర్లు పోతంశెట్టి నాగేశ్వరరావు,నామిశెట్టి  వెంకట్ ,పొట్టిశ్రీహరి బిజెపి నాయకులు గొలగాని రవికృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

NP కుమార్

NTR జిల్లా BJP

మీడియా సెల్ కన్వినర్