ముఠా కార్మిక మానవ మూర్తి పశ్చిమ ఎమ్మెల్యే - సుజనాచౌదరి

ముఠా కార్మిక మానవ మూర్తి పశ్చిమ ఎమ్మెల్యే - సుజనాచౌదరి

వస్త్రలత అసోసియేషన్ కార్మిక ముఠా  యూనిఫామ్ పంపిణీ

విజయవాడ -జన చైతన్య కేబుల్ న్యూస్ (టి. గంగాధర్‌ )

 భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో 250 మంది కార్మికులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) ను పంపిణీ చేసిన ప్రియతమ శాసన సభ్యులు శ్రీ సుజనా చౌదరి. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ముఠాకార్మికులతోసమావేశమయ్యామని అప్పట్లో వారు ఉచితంగా యూనిఫామ్ అందజేయాలని కోరడంతో ఇచ్చిన హామీ మేరకు  ముఠా కార్మికులకు ఉచితంగా  యూనిఫామ్ ను అందజేశామన్నారు. కార్మికుల శ్రేయస్సే తన లక్ష్యం అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధితో ముందుకు వెళ్తామని అన్నారు.  సుజనా ఫౌండేషన్ సహకారంతో విద్య , వైద్యం , ఆరోగ్య రంగాలలో విప్లవాత్మకమైన  మార్పులను తీసుకువచ్చే విధంగా  పశ్చిమ అభివృద్ధికి నిరంతరంపాటుపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి ఎవరు  పోటీ చేసిన  పశ్చిమ అభివృద్ధిని చూసి ప్రజలు  గెలిపించే విధంగా తన పాలన ఉంటుందన్నారు. ప్రజలకు ఏ  అవసరం వచ్చిన  ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని సుజనా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు  అడ్డూరి శ్రీరామ్ , పైలా సొమినాయుడు , బొమ్మసాని సుబ్బారావు, సుబ్బారాయుడు , కోగంటి రామారావు , యేదుపాటి రామయ్య  , అబ్దుల్ ఖాదర్  , తిరుపతి అనూష  తదితరులు పాల్గొన్నారు.మీపైలా సురేష్ బాబుబీజేపీ యువ నాయకులు .