ఒకే పేరు మీద ఎక్కువ సిమ్ లు మోసపూరితమైన కాల్స్

ఒకే పేరు మీద ఎక్కువ సిమ్ లు మోసపూరితమైన కాల్స్

 సిమ్ కార్డులు ఎక్కువ ఒకే పేరు మీద ఎన్నో మోసపూరితమైన కాల్స్ 

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

కేంద్రం కీలక నిర్ణయం.1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌.. కారణం ఏంటో ఈ స్టోరీ చదవాల్సిందే. మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. అధికారిక నివేదికలు విడుదల ప్రకారం ఈ మొబైల్ నంబర్లు ఆర్థిక మోసంతో ముడిపడి ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై సమావేశం జరిగింది. 

ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ఇంటిగ్రేషన్ ద్వారా సివిల్ ఫైనాన్షియల్ సైబర్, సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌పై బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సహా వివిధ సమస్యలను చర్చించింది.

CFCFRMS ప్లాట్‌ఫారమ్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ (NCRP)తో అనుసంధానించబడుతుంది. దీనివల్ల పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థ