ముగ్గురు సస్పెండ్ ఇద్దరు ను ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారులు

ముగ్గురు సస్పెండ్ ఇద్దరు ను ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారులు
జనచైతన్య న్యూస్- కారంపూడి
పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు, ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి, తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు కలిసి గురువారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు, ప్రిన్సిపల్ నయోమి ఆ ఉపాధ్యాయుడిని రక్షించి, తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చి, పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు, ఘటనపై ఆర్జేడీ, డీఈఓలకు తెలిపారు. అధికారులు విచారిస్తుండగా మరోసారి ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడులు, ప్రిన్సిపల్ నయోమి, వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, బాలికల వసతిగృహ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.