మల్లనూరు అమానుష ఘటనపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి*

*చిత్తూరు జిల్లా కుప్పం*
*మల్లనూరు అమానుష ఘటనపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి*
*చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మల్లనూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వికలాంగురాలిపై రమేష్ అనే 45 సంవత్సరాల కామాంధుడు లైంగిక దాడి చేయడం హేయమైన చర్య : మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి*
*చిత్తూరు జిల్లా ఎస్పీ గారితో చరవాణి ద్వారా మాట్లాడి ఇంతటి దురాగాతానికి పాల్పడినటువంటి ఆ కామాంధునికి కఠినమైన శిక్ష పడే విధంగా ఐపిసి సెక్షన్స్ ద్వారా కేసు నమోదు చేయాలని బాలికకు మెరుగైన వైద్య సహాయం అందించి ఐసిడిఎస్ వసతి గృహానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్పీ గారు స్పందిస్తూ అరెస్టు చేసామని మద్యం మత్తులో బాధితురాలి మీద దాడి చేశాడని ఆరోగ్యపరంగా తనకు అందించాల్సిన వైద్యం అందించామని అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని బాధితురాలికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది*.
*చిత్తూరు జిల్లా ఐసిడిఎస్ పిడిని బాధితురాలికి వైద్య సహాయము వసతి సహాయము అందించవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి*